News September 19, 2025
అనంతపురం GGHలో జూ.డాక్టర్పై అత్యాచారయత్నం?

అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్పై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగుడు మూడు రోజుల క్రితం రాత్రి ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆమెను గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. డాక్టర్ కేకలతో రోగుల బంధువులు స్పందించి దుండగుడికి దేహశుద్ధి చేశారు. బాధితురాలు ఈ విషయాన్ని ఆర్ఎమ్వో హేమలతకు తెలియజేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
Similar News
News September 19, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.
News September 19, 2025
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం

2వ రోజు అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి MLA కొణతాల రామకృష్ణ గళం వినిపిస్తుండగా .. విప్లు మాట్లాడుకుంటూ ఉండడాన్ని తప్పుబట్టారు. విప్లు కాస్త మాటలు తగ్గించాలన్నారు. అత్యవసరమైతే బయటికి వెళ్లిపోవాలని సూచించారు. అలా కాదని సభలో గందరగోళం సృష్టిస్తూ అంతరాయం కలిగించవద్దని మనవి చేశారు.
News September 19, 2025
ఇది కదా అసలైన మార్పంటే.. హరీశ్ రావు సెటైర్

TG: తాము మేడిగడ్డ-మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ₹84వేల కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ తమ్మిడిహట్టి-ఎల్లంపల్లికి ₹35వేల కోట్లు కేటాయించిందని హరీశ్రావు విమర్శించారు. ‘కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనేది లక్ష్యమైతే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47లక్షల ఎకరాలకే సాగు నీరట! ₹35వేల కోట్లతో కేవలం 4.47లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచన అద్భుతం. ఇది కదా అసలైన మార్పంటే?’ అని హరీశ్ సెటైర్ వేశారు.