News July 21, 2024

అనంత: ఇద్దరు చిన్నారులు దుర్మరణం

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని చిన్నారులు మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాలు..<<13666450>>గుమ్మగట్ట<<>>(M) ఎస్.హొసళ్లి‌కి చెందిన మల్లికార్జున కుమారుడు అరుణతేజ, మల్లేశ్ కుమార్తే స్పందన.. వీరిద్దరూ అన్నదమ్ములు. చిన్నారులను రాయదుర్గం పాఠశాలకు మామ సురేశ్ బైక్‌పై తీసుకెళుతుండగా వేగంగా వచ్చి ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణతేజ అక్కడికక్కడే మృతిచెందగా, స్పందన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

Similar News

News December 22, 2025

అర్జీల పరిష్కారంలో దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజలు ప్రజా వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 22, 2025

సిద్దరాంపురం వాసికి IESలో ఆల్ ఇండియా 22వ ర్యాంక్

image

ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తాల్లూరు హరికృష్ణ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా లెవెల్ 22వ ర్యాంక్ సాధించారు. ఆత్మకూరు మాజీ జడ్పీటీసీ హనుమంతప్ప చౌదరి మనవడైన హరికృష్ణ అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. 2022 నుంచి RWS శాఖలో AEEగా కుప్పంలో విధులు నిర్వహిస్తూ, IES కోసం కష్టపడి తాజాగా 22వ ర్యాంక్ సాధించారు.

News December 22, 2025

సిద్దరాంపురం వాసికి IESలో ఆల్ ఇండియా 22వ ర్యాంక్

image

ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తాల్లూరు హరికృష్ణ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా లెవెల్ 22వ ర్యాంక్ సాధించారు. ఆత్మకూరు మాజీ జడ్పీటీసీ హనుమంతప్ప చౌదరి మనవడైన హరికృష్ణ అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. 2022 నుంచి RWS శాఖలో AEEగా కుప్పంలో విధులు నిర్వహిస్తూ, IES కోసం కష్టపడి తాజాగా 22వ ర్యాంక్ సాధించారు.