News March 24, 2025

అనంత: ఈతకు వెళ్లి 10th విద్యార్థి మృతి.!

image

అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని మొబ్బు కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Similar News

News October 27, 2025

అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

image

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 27, 2025

రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్‌లో సత్తాచాటిన క్రీడాకారులు

image

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్‌కు అండర్-6లో 4వ స్థానం, వెనీషా‌కు బాలికల -12లో 4వ స్థానం, నితీష్‌కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.