News March 23, 2024
అనంత: ఎన్టీఆర్ విగ్రహం పాక్షిక ధ్వంసంపై కేసు నమోదు

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్కు చీపుర్లు కట్టి, ఏదో మంత్రం రాశారన్నారు. ఇది గమనించిన టీడీపీ నగర అధ్యక్షుడు ఆకులేటి మారుతి కుమార్ గౌడ్ శుక్రవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ ధరణి కిషోర్ తెలిపారు.
Similar News
News December 28, 2025
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్గా ఆదెన్న

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్గా రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం ఆదెన్న పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్కు పంపారు. శనివారం రాత్రి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. సుమారు 20 ఏళ్లపాటు TDP లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఆదెన్న పనిచేశారు. అనంతపురంలో స్థిరపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News December 28, 2025
అనంత: భారీగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గుత్తి పట్టణంలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260. అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.260. గుంతకల్లులో రూ.220, స్కిన్లెస్ రూ.240గా విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ రూ.750లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇలా చికెన్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు అయోమయంలో పడ్డారు.
News December 28, 2025
అనంత: ఈనెల 29న కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


