News April 13, 2025

అనంత: ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి తృటిలో తప్పిన ప్రమాదం

image

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియ బేగం ఆదివారం నెల్లూరుకు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆమె భర్త రియాజ్ పేర్కొన్నారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. తిరుపతి శివారులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆమె చికిత్స పొందుతుందన్నారు.

Similar News

News April 23, 2025

కూలీ కుమారుడికి 593 మార్కులు

image

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

News April 23, 2025

10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

image

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్‌తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.

News April 23, 2025

10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్‌తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!