News June 16, 2024

అనంత: గుండెపోటుతో విద్యార్థిని మృతి

image

అనంతపురానికి చెందిన జాహ్నవి విజయవాడ శివారు గూడవల్లిలో గుండెపోటుతో మృతిచెందింది. ఈ మేరకు పటమట సీఐ మోహన్ రెడ్డి వెల్లడించారు. జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వెళ్లింది. శనివారం అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు.. జాహ్నవి గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Similar News

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో అనంతపురం MPకి 8ర్యాంక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో అనంతపురం MP అంబికా లక్ష్మీనారాయణ 8వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 78 ప్రశ్నలు అడగగా, 8 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 89.71గా ఉంది. ఆయన పనితీరుపై మీ కామెంట్..!

News September 14, 2025

వైద్యాధికారులతో అనంతపురం కలెక్టర్ సమావేశం

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ ఆనంద్‌ను DMHO డాక్టర్ దేవి పుష్పగుచ్చంతో శనివారం స్వాగతించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న సేవలపై DMHOతో చర్చించారు. జిల్లాలో PHC, CHC, విలేజ్ హెల్త్ సెంటర్, క్లినిక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News September 13, 2025

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.