News July 18, 2024

అనంత జిల్లాకు తుంగభద్రమ్మ రాక

image

తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్చెల్సీకి ఈనెల 21 నీరు విడుదల చేయాలంటూ హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ తుంగభద్ర మండలి ఎస్‌ఈకి బుధవారం ఇండెంట్ లేఖ పంపారు. 25వతేదీ వరకు 500 క్యూసెక్కులు, 26 నుంచి 31వరకు 750 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. నీరు విడుదలచేస్తే 22కి జిల్లా సరిహద్దుకు చేరే అవకాశం ఉంది. ప్రధాన కాలువల ద్వారా కణేకల్లు చెరువుల్లోకి చేరి అక్కడ నుంచి ఏపీబీఆర్ జలాశయం, జీబీసీ కాలువకు ప్రవాహాలు కొనసాగుతాయి

Similar News

News January 5, 2026

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.

News January 5, 2026

ఈ నెల 6, 7వ తేదీలలో ఇంటర్వ్యూలు

image

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.

News January 4, 2026

అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

image

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.