News June 13, 2024

అనంత: పార్టీ ఏదైనా తగ్గని కురబల ప్రాతినిధ్యం

image

పార్టీ ఏదైనా జిల్లాలో కురుబల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యే, కురుబ సామాజికవర్గానికి చెందిన శంకర్ నారాయణ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. రెండో పర్యాయంలో అదే వర్గానికి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో సవిత మెుదటిసారి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం.

Similar News

News December 22, 2025

అనంతపురం: కరెంటోళ్ల జనబాట పోస్టర్ ఆవిష్కరణ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో AP SPDCL కరెంట్ టోళ్ల జన బాట పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో కరెంట్ టోళ్ల జన బాట పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News December 22, 2025

అనంతపురం: ఉద్యోగాలను సొంతం చేసుకోండి..!

image

అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు 10th ఆపై చదివి, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలన్నారు.

News December 22, 2025

అర్జీల పరిష్కారంలో దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజలు ప్రజా వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.