News July 16, 2024
అనంత: పీర్ల స్వామి అగ్నిగుండంలో వెలుగుతున్న నిప్పు

కుందిర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీకి చెందిన రుద్రంపల్లిలో పీర్ల స్వామి అగ్నిగుండంలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్టెలు కాలిన తర్వాత నిప్పుపై మట్టిని వేస్తే ఆరిపోతుంది. గతేడాది మట్టితో కప్పి వేసిన పీర్ల స్వామి అగ్ని గుండాన్ని సోమవారం తవ్వారు. అయితే ఇప్పటికీ అగ్గి వెలుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచింది. దేవుడి మహిమ అంటూ ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు.
Similar News
News December 25, 2025
శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
News December 25, 2025
తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.
News December 25, 2025
అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.


