News March 20, 2025

అనంత: రెవెన్యూ సెక్టార్‌పై వీడియో కాన్ఫరెన్స్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ సెక్టార్‌పై డీఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా రిజిస్టర్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఎస్ఆర్ఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సెక్టర్‌లో అవకతవకలు జరిగితే ఏ ఒక్క అధికారిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

Similar News

News March 20, 2025

700 మందితో కదిరి బ్రహ్మోత్సవాలలో బందోబస్తు

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో గురువారం సాయంత్రం జరిగే రథోత్సవానికి 700 మందితో బందోబస్తు చేపట్టినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. 6 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 500 మంది సివిల్ పోలీస్ సిబ్బందితో పాటు 100 మంది స్పెషల్ పార్టీ, ఆర్మూర్ రిజర్వుడ్ పార్టీ, 90 మంది ఏపీఎస్పీ పార్టీలతో బందోబస్తు నిర్వహించనున్నామని తెలిపారు. మరో 60 మంది మఫ్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News March 20, 2025

రెండో రోజు 352 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. 135 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 352 మంది గైర్హాజరు అయ్యారు. 30,862 మందికి గానూ 30,537 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ రాంనరగ్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో A, B పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

News March 20, 2025

అనంతపురంలో యువతి ఆత్మహత్య

image

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!