News March 23, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులకు తీవ్ర గాయాలు

image

వజ్రకరూరు మండలం కమలపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కమలపాడుకు చెందిన రవితేజ, అజయ్, నరేష్ కొనకొండ్ల జడ్పీ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాశారు. బైక్‌లో ముగ్గురు కమలపాడుకు బయలుదేరారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు.

Similar News

News September 7, 2025

పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సీఎం పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతపురంలోని బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ప్రసన్నాయపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేసులు పాల్గొన్నారు.

News September 7, 2025

జోరుగా మహాలయ పున్నమి పండుగ

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహాలయ పున్నమి గురించి తెలియని వారుండరు. మాంసం ప్రియులకు ఇష్టమైన పండుగ ఇది. ఇవాళ మహాలయ పౌర్ణమి. వాడుకలో ఇది మాల పున్నమిగా ఉంది. ఇవాళ మటన్ తినడం పూర్వం నుంచి వస్తుందని పెద్దలు చెబుతారు. చంద్రుడిని చూస్తూ ముక్క తినాలంటారు. అందుకే తెల్లవారుజామునే పలు గ్రామాల్లో మటన్ వండుతారు. మాలపున్నమి కావడంతో మటన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.

News September 7, 2025

రైతులకు అవసరమైన యూరియాను అందించాలి: కలెక్టర్

image

రైతులకు అవసరమైన మోతాదులో యూరియాను అందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రైవేట్ వారికి 50శాతం, ప్రభుత్వ ఆధ్వర్యంలో 50శాతం విక్రయాలు జరిగేవన్నారు. ఈసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 70శాతం, ప్రైవేట్ ఆధ్వర్యంలో 30శాతం పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు. మండల అధికారులు రోజూ దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు.-