News April 5, 2024
అనంత: వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్థి మృతి

యాడికి మండలంలో వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్ధి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయలచెరువుకు చెందిన నిఖిల్ చౌదరి తమ సొంత పరిశ్రమ పనుల నిమిత్తం 2 రోజులు ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News September 9, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
News September 9, 2025
అనంత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై రాళ్ల దాడి

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా జరుపుకునేందుకు కూటమి నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రాళ్ల దాడిలో దెబ్బతిన్న కారును పోలీసులు పరిశీలించారు.
News September 9, 2025
అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.