News October 15, 2024
అనంత, సత్యసాయి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించింది. అనంతపురం జిల్లాకు టీజీ భరత్, శ్రీ సత్యసాయి జిల్లాకు అనగాని సత్యప్రసాద్ ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.
Similar News
News October 15, 2024
కంట్రోల్ రూమ్ను పరిశీలించిన సత్యసాయి జిల్లా జేసీ
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 15, 2024
అనంతపురం జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచనతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు APSDMA అలర్ట్ మెసేజ్లు పంపుతోంది. మరోవైపు జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
News October 15, 2024
అనంతపురం జిల్లాలో మద్యం లాటరీ విచిత్రాలు
➤ ధర్మవరం నియోజకవర్గంలో 5 షాపులు దక్కించుకున్న సందిరెడ్డి శ్రీనివాసులు
➤ మడకశిర నియోజకవర్గంలో 4 దుకాణాల విజేతలుగా వెంకటసుబ్బారెడ్డి, వైజయంతిమాల దంపతులు
➤ తాడిపత్రిలో 6 షాపులు దక్కించుకున్న కాకర్ల రంగనాథ్ కుటుంబసభ్యులు
➤ ఆత్మకూరు మండలంలోని రమేశ్, శ్రీదేవి దంపతులకు 4దుకాణాలు
➤ 4 షాపుల విజేతగా సన్నపురెడ్డి సుజల
☛ అనంత జిల్లాలో 18 షాపులు మహిళలు, 118 పురుషులకు
☛ సత్యసాయి జిల్లాలో 5 మహిళలు, 82 పురుషులకు