News May 26, 2024

అనంత: సప్లిమెంటరీ పరీక్షలకు 90శాతం విద్యార్థులు గైర్హాజరు..!

image

అనంత జిల్లాలో 10వ తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 90శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షలు విభాగం ఏ.సి. గోవింద నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 సెంటర్లలో హిందీ పరీక్షకు 1680 మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 170 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి తనిఖీ చేశారు.

Similar News

News September 13, 2025

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.

News September 13, 2025

‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

image

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.

News September 13, 2025

ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

image

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.