News December 25, 2025

అనంత: స్నేహితుల మధ్య గొడవ.. కత్తితో దాడి

image

అనంతపురంలోని కమల నగర్‌కు చెందిన స్నేహితులు జనార్దన్, సుధాకర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఇద్దరూ కలిసి వాళ్ల మిత్రుడు ఇంటికి భోజనానికి వెళ్లారు. వారిద్దరి మధ్య మాట-మాట పెరగడంతో జనార్దన్ తన స్నేహితుడు సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

విశాఖకు భారీగా పర్యాటకులు.. నో రూమ్స్

image

విశాఖ అందాలకు పర్యాటకులు ఖుషీ అవుతున్నారు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ సందర్శకులతో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని సందర్శనయ స్థలాలు కిక్కిరిసిపోయాయి. నగరం, పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళు, లాడ్జిలు చివరికి కళ్యాణ మండపాల్లో ఉండే గదులు సైతం సందర్శకులతో నిండిపోయాయి. కొద్ది రోజులుగా టూరిస్టులకు గదులు దొరకడం గగనం అయిపోతుంది. ఉదయం పూట మంచుతో పూర్తిగా కప్పబడి సందర్శకులకు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది.

News December 27, 2025

MBNR:CM ప్రకటన..1,683 GPలకు లబ్ది

image

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్లకే అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ. 10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1,683 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.

News December 27, 2025

గద్వాల్ జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌లో 7,056 కేసులు

image

గద్వాల్ జిల్లాలో పోలీస్ శాఖ నేర వార్షిక నివేదిక విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 41 అత్యాచార కేసులు, 14 హత్యలు, 4 చోరీ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు తీవ్రతను చాటుతూ 204 ఘటనల్లో 135 మంది ప్రాణాలు కోల్పోగా, 189 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 7,056 కేసులు నమోదు చేసి రూ. 33.96 లక్షల జరిమానా వసూలు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద 64 కేసుల్లో 424 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.