News March 11, 2025
అనంత: ‘స్వీకరించిన అర్జీలను పరిష్కరిస్తాం’

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 10, 2025
అనంత: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

అనంతపురం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. కమలనగర్లోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా జరుగుతున్నాయని వివరించారు. అధికారులు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నట్లు వెల్లడించార
News March 10, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
News March 10, 2025
టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.