News December 21, 2025
అనంత, హిందూపురం లోక్సభ టీడీపీ అధ్యక్షులు వీరే..!

టీడీపీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం లోక్సభ అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్ చౌదరిని నియమించారు. హిందూపురం లోక్సభ అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ప్రధాక కార్యదర్శిగా హనుమప్పను నియమించారు.
Similar News
News December 21, 2025
ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.
News December 21, 2025
ఘన జీవామృతం ఎలా వాడుకోవాలి?

తయారుచేసిన ఘనజీవామృతాన్ని వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని వాడాలనుకుంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనెసంచులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడాలి. ఒకసారి తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరాకు దుక్కిలో 400kgల ఘనజీవామృతం వేసుకోవాలి. పైపాటుగా మరో 200kgలు వేస్తే ఇంకా మంచిది. దీని వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం, పంట దిగుబడి పెరుగుతుంది.
News December 21, 2025
#SaveAravalli: పురాతన పర్వతాల కోసం నెటిజన్ల పోరాటం!

గుజరాత్, రాజస్థాన్, హరియాణాల్లో విస్తరించిన ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ సోషల్ మీడియాలో #SaveAravalli క్యాంపెయిన్ ఊపందుకుంది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలనే ‘ఆరావళి’గా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పడమే దీనికి కారణం. దీనివల్ల మైనింగ్, అక్రమ కట్టడాలు, ఎడారి ధూళి వల్ల ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రం కావడం, రాజస్థాన్లో వర్షాలు తగ్గడం వంటి దుష్పరిణామాలు ఉంటాయని పర్యావరణవేత్తల ఆందోళన.


