News June 4, 2024
అనకాపల్లిలో సీఎం రమేశ్ గెలుపు

అనకాపల్లి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ 2,96,530 పైచిలుకు మెజార్టీలో ఉన్నారు. సీఎం రమేశ్కు 7,62,069 ఓట్లు పోలవ్వగా.. తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకి 4,65,539 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్తి వేగి వెంకటేశ్కు 25,651 ఓట్లు పోలవ్వగా.. నోటాకు 26,235 మంది ఓటేశారు.
Similar News
News September 14, 2025
రేపు విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో, సీపీ, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News September 14, 2025
సృష్టి కేసులో విశాఖలో సిట్ తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సృష్టి కేసులో విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు, తెలంగాణ సిట్ బృందం
తనిఖీలు చేపట్టారు. నగరంలోని సృష్టి కార్యాలయం, ఆసుపత్రిలో రాత్రి 12:00 వరకు తనిఖీలు కొనసాగాయి. జిల్లా వైద్య అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి తనిఖీలు చేపట్టగా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేజీహెచ్ డాక్టర్లు ముగ్గురు సస్పెండ్ కాగా మిగతావారి పాత్ర తేలాల్సి ఉంది.
News September 13, 2025
విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.