News March 31, 2025
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం వద్ద శంకుస్థాపన చేశారు. రూ.243 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 13.8 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారిగా విస్తరించనున్నారు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.
Similar News
News April 2, 2025
బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
News April 2, 2025
అనకాపల్లి జిల్లాలో 94.87 పెన్షన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంగళవారం 94.87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,072 మందికి పెన్షన్ పంపిణీకి రూ.108 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 2,43,580 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉందన్నారు.
News April 2, 2025
బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.