News March 28, 2025
అనకాపల్లి: ఆనాటి కాకతాంబ.. నేడు నూకాంబిక

అనకాపల్లిలో 1450లో నూకాంబిక అమ్మవారు మొదట కాకతాంబగా కొలువైంది. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కాకతాంబ గుడిని నిర్మించారు. తర్వాత విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారుగా మార్చారు. 1935లో నూకాంబిక అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రతి ఏటా కొత్త అమావాస్య నుంచి నెలరోజులపాటు జాతర జరుగుతుంది.
Similar News
News November 8, 2025
APSRTCలో 277 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

APSRTCలో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకున్న తర్వాత వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: apsrtc.ap.gov.in/
News November 8, 2025
గంభీరావుపేట: పంట పొలాల్లో రైతు మృతి

వరి పంట పొలంలో రైతు హఠాత్తుగా మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గజ సింగవరం గ్రామానికి చెందిన ధ్యాన బోయిన విజ్ఞయ్య శుక్రవారం వరి పొలం కోయడానికి వెళ్లగా హఠాత్తుగా కిందపడి మృతి చెందాడు. తనకున్న ఎకరంలో వరి పంట సాగు చేశాడు. అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. పంట చేతికస్తుందో లేదో అని ఆందోళనతో కుప్పకూలి హఠాన్మరణం చెందాడు.
News November 8, 2025
కృష్ణా: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

శబరిమలై వెళ్లేవారికై ఉమ్మడి జిల్లా మీదుగా మచిలీపట్నం (MTM), కొల్లం(QLN) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ NOV 14-NOV 28 వరకు ప్రతి శుక్రవారం MTM-QLN(నం.07101), NOV 16 నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం QLN-MTM(నం.07102) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.


