News March 13, 2025

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బేబీ ఫీడింగ్ సెంటర్ 

image

అనకాపల్లి, పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బాలింతలు పిల్లలకు పాలు ఇచ్చేందుకు బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి ప్రజా రవాణా అధికారి కె. పద్మావతి తెలిపారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఓ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో బేబీ ఫీడింగ్ సెంటర్‌ను బుధవారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలింతలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News March 13, 2025

మహిళా ఎస్సైపై దాడి చేసిన ఆకతాయిలు

image

AP: విజయనగరం జిల్లాలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై ఆకతాయిలు దాడి చేశారు. వేపాడ మండలంలో జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసభ్యంగా డాన్స్ చేశారు. దీనిని మహిళా ఎస్సై అడ్డుకోవడంతో ఆమెను జుట్టు పట్టుకొని లాగారు. అనంతరం ఆమెపై దాడిచేసి తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. మహిళా ఎస్సైని ఆసుపత్రికి తరలించారు

News March 13, 2025

భువనగిరి: పీఎం శ్రీ పథకం ఎంతో ప్రయోజనకరం

image

యాదాద్రి జిల్లాలో పీఎం శ్రీ పథకానికి మొదటి విడతలో 17 పాఠశాలలకు, రెండో విడతలో 8 పాఠశాలలకు చోటు దక్కింది. విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పథకం గ్రామీణ ప్రాంత పాఠశాలల బలోపేతానికి, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడానికి దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.

News March 13, 2025

దేవీపట్నం: పెళ్లి రోజే ఆమెకు చివరిరోజు 

image

దేవీపట్నం మండలం దేవారం గ్రామానికి చెందిన కె. శ్రీదేవి(45) పెళ్లిరోజే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీదేవి అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ కృష్ణునిపాలెంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. బుధవారం 25వ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!