News April 8, 2025

అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

image

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్‌కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

Similar News

News April 17, 2025

అల్లు అర్జున్‌కు మరో ఇన్‌స్టా అకౌంట్!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెయింటేన్ చేస్తున్నట్లు సమాచారం. ‘బన్నీ బాయ్ ప్రైవేట్’ పేరుతో ఉన్న అకౌంట్‌ అల్లు అర్జున్‌దే అని అభిమానులు గుర్తించారు. ఈ అకౌంట్‌ను ఆయన భార్య స్నేహ, సమంత, త్రిష, రానా, ఉపాసన, నిహారిక వంటి స్టార్లు ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్‌లో 1380 పోస్టులు చేయగా, బన్నీ 494 మందిని ఫాలో అవుతున్నారు. ఇందులో తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో బన్నీ మీమ్స్ షేర్ చేస్తారట.

News April 17, 2025

మహబూబ్‌నగర్‌లో దారుణ ఘటన

image

ఆస్తి కోసం తండ్రి మృతదేహానికి కన్న కొడుకు తలకొరివి పెట్టకపోవడంతో చివరకు చిన్న కూతురు పెట్టింది. ఈ ఘటన MBNR పద్మావతి కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీ వాసి మాణిక్యరావు మృతిచెందారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రూ.కోటి విలువ చేసే ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతానన్నాడు. చివరకు బంధువుల సూచనతో చిన్నకూతురు తలకొరివి పెట్టింది.

News April 17, 2025

సంగారెడ్డి: భూభారతి షెడ్యూలు విడుదల

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూభారతి అవగాహన సదస్సు షెడ్యూల్ విడుదల చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తెలిపారు. ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సుకు అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు ఎంపీడీవోలు హాజరుకావాలని సూచించారు.

error: Content is protected !!