News January 30, 2025
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 21,555 మంది

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు ప్రస్తుతం 21,555 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 12,948, మహిళలు 8,607 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 123 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
కలకడ: హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కలకడ SI రామాంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10న ముడియంవారిపల్లె, కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్, అతని తండ్రి వెంకటరమణ, తల్లి సుబ్బమ్మపై ముడియంవారిపల్లి ప్రసాద్రెడ్డి, గంగిరెడ్డి, పుస్పావతి, శ్రీనివాసులురెడ్డి అతని అనుచరులు కొడవలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ కేసులో నలుగురితో పాటు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు.
News September 17, 2025
ములుగు: పెద్దలను స్మరించుకునే ‘కొత్తల’ పండగ

ఆదివాసీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు విభిన్నమైనవి. ప్రకృతితో మమేకమై వారు జరుపుకొనే పండుగల్లో కొత్తల(పెద్దల)పండుగ ఒకటి. సెప్టెంబర్లో ఉత్తర కార్తె మొదటి పాదం ప్రారంభమైన తర్వాత బుధ, గురువారాల్లో నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు కోడి, యాటపోతులు బలిచ్చి వనభోజనాలకు పోతారు. కొత్త ధాన్యాలు, సాక పోసి మొక్కుతారు. మరణించిన పెద్దలకు నైవేద్యం ఇస్తారు. నూతన వధూవరులకు తమ వంశంలో పూర్తి హక్కులు కల్పిస్తారు.
News September 17, 2025
KMR: మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే..

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి కోర్టు మంగళవారం రూ.21,000 జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తికి కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. ‘మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.