News February 28, 2025

అనకాపల్లి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి రూ.107.46 కోట్లు

image

అనకాపల్లి జిల్లాలో మార్చి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.107.46 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,272 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము డ్రా చేస్తారన్నారు.

Similar News

News November 3, 2025

NRPT: నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

image

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నేడు నారాయణపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్‌‌ఈ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

News November 3, 2025

జగిత్యాల: 55 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు..!

image

జగిత్యాల పట్టణంలోని మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్ ( ప్రస్తుత ఓల్డ్ హై స్కూల్ ) 1969-70 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 55 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరంతా తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా హాయిగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, రాచకొండ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.

News November 3, 2025

మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

image

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.