News March 6, 2025
అనకాపల్లి: కత్తితో దాడి.. యువకుడి మృతి

అనకాపల్లి మండలం కుంచంగి వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. బుచ్చయ్యపేట మండలం కరకకు చెందిన బి.నూకేష్కుమార్(28) డాక్ యార్డ్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బైక్పై విశాఖ నుంచి వస్తున్న నూకేష్ కుమార్పై కుంచంగి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించారు.
Similar News
News July 6, 2025
ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.
News July 6, 2025
ఈనెల 10 లోపు శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

ఈనెల 10 తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News July 6, 2025
SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.