News March 6, 2025

అనకాపల్లి: కత్తితో దాడి.. యువకుడి మృతి

image

అనకాపల్లి మండలం కుంచంగి వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. బుచ్చయ్యపేట మండలం కరకకు చెందిన బి.నూకేష్‌కుమార్(28) డాక్ యార్డ్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై విశాఖ నుంచి వస్తున్న నూకేష్ కుమార్‌పై కుంచంగి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించారు.

Similar News

News November 7, 2025

మల్యాల: ‘రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి’

image

మల్యాల మం. రామన్నపేట, పోతారం, రాజారం గ్రామాల ప్యాడీ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ B.S.లత పరిశీలించారు. కేంద్రాల్లో తూకపు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు, క్లీనర్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. A గ్రేడ్‌కు రూ.2389, B గ్రేడ్‌కు రూ.2369 మద్దతు ధర అని తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004258187ను సంప్రదించాలన్నారు.

News November 7, 2025

క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

image

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.

News November 7, 2025

ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

ఉలవపాడు మండలం చాగల్లు–వీరేపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గాయత్రి మిల్క్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వాహనం డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మద్దిపాడు మండలం వెల్లంపల్లిగా స్థానికులు గుర్తించారు. ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు.