News March 7, 2025

అనకాపల్లి: క్వారీలపై ఫిర్యాదుల మేరకు విచారణ

image

జిల్లాలోని రాయి క్వారీలపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న తనిఖీలపై గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీ అశోక్‌కుమార్‌ రాయి క్వారీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, గనుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో క్వారీల్లో తనిఖీలు జరుపుతున్నామన్నారు. అనుమతి లేని క్వారీలను సీజ్‌ చేసి, అదనంగా తవ్వకాలు జరిపిన క్వారీల నిర్వాహకులకు జరిమానాలు విధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు.

Similar News

News March 9, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్‌, విజయ్‌ బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్‌ అదుపు తప్పి కళ్యాణ్‌‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్‌ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్‌కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.

News March 9, 2025

బాపట్ల : చికెన్, మటన్ ధరలు ఇలా..!

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్‌ధరలకు డిమాండ్ పెరిగింది. గతవారంతో పోలిస్తే కేజీకి రూ.20-30 ధర పెరిగింది. పలు చోట్ల ఈ వారం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ. 180ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.800- 900లు ఉంది.  బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గడంతో చికెన్ ధరలలో రూ.30లకు పైగా ధర పెరిగింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 9, 2025

ఆలస్యమవుతున్న ‘రాజాసాబ్’? అదే కారణమా?

image

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సింహభాగం షూటింగ్ పూర్తయింది. అయితే ఓ విచిత్రమైన పరిస్థితి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ పూర్తైన ఫుటేజీ ఏకంగా మూడున్నర గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని తగ్గించేందుకు మూవీ టీం చెమటోడుస్తోందని సినీవర్గాలంటున్నాయి. ప్రభాస్ ఇందులో తాత, మనవడి పాత్రల్లో కనిపిస్తారని టాక్.

error: Content is protected !!