News April 16, 2025
అనకాపల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసామని రావికమతం ఎస్ఐ ఎం.రఘువర్మ మంగళవారం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కాలినడకన 8 కిలోల గంజాయితో తమిళనాడుకు చెందిన మహిళతో పాటు మరొక పురుషుడు, ప్రయాణిస్తున్నారని సమాచారం మేరకు రావికమతం పొలిమేరలో సిబ్బందితో తనిఖీ చేపట్టగా గంజాయితో సహా ఇరువురు పట్టుబడినట్లు తెలిపారు.
Similar News
News October 28, 2025
KMM: వామ్మో.. 5 కోట్ల సంవత్సరాల దారుశిలాజం హా?

మధిర రైల్వే స్టేషన్ రామాలయం పునర్నిర్మాణ పనుల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో లభించిన ఓ పురాతన రాయిని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. అది సుమారు 5 కోట్ల సంవత్సరాల వయసు గల దారుశిలాజంగా గుర్తించారు. విస్తృత పరిశోధన కోసం శిలను HYD ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన రాయి దొరకడంపై ఆలయ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
News October 28, 2025
రాయపట్నంలో సబ్స్టేషన్కు Dy.CM భట్టి శంకుస్థాపన

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.
News October 28, 2025
వనపర్తి: పేదల కడుపు నింపండి.. రూ.5 భోజనం పెట్టండి

వనపర్తి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహాలో రూ.5కే భోజనం అందించే పథకాన్ని అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కొత్త బస్టాండ్, గాంధీచౌక్, అంబేడ్కర్ చౌరస్తా, కలెక్టర్ కార్యాలయం వంటి ఆరు ప్రాంతాల్లో భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు.


