News April 8, 2025

అనకాపల్లి జిల్లాలో ‘గుండె’లు పిండేసిన ఘటన

image

బుచ్చయ్యపేట(M)బంగారుమెట్టులో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో సోమవారం మరణించారు. మేరుగు శ్రీను(28) పెయింటింగ్ పనికి అరకు వెళ్లాడు. పని చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మరణించాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న నక్కా లక్ష్మీనారాయణ(48) మధువాడ ఐటీ హిల్స్ వద్ద గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News February 19, 2026

హౌసింగ్ సమస్యలపై ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం

image

కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. సిమెంట్, స్టీల్ సరఫరా, నిర్మాణ బిల్లులు మరియు PMAY 2.0 Urban ఇళ్లకు సంబంధించిన వివరాల కోసం ప్రతి గురువారం ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
★ సంప్రదించాల్సిన నంబర్: 08518-257481

News February 19, 2026

అభి‘షేక్’ ఆడిస్తాడనుకుంటే..

image

భారత స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్నారు. టన్నుల కొద్దీ రన్స్ చేస్తారనుకుంటే <<19177966>>డకౌట్లతో<<>> రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఖాతా కూడా తెరవలేదు. నిన్నటి మ్యాచ్‌లో సిరాజ్ జెర్సీతో బ్యాటింగ్‌కు వచ్చినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై ఒత్తిడి పడుతోంది. అభిషేక్ ఫామ్‌లోకి రాకపోతే సూపర్-8 మ్యాచుల్లో టీమ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

News February 19, 2026

HYD: నెల రోజులు రెక్కీ చేసి.. దారుణ హత్య

image

వనస్థలిపురం PS పరిధిలో వివాహిత హత్య జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. BNరెడ్డి కప్పలచెరువు వద్ద గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత(30)కు 2022లో నిందితుడు మహేశ్(30)తో వివాహమైంది. గొడవల వల్ల 2024లో విడాకులు తీసుకుని 2025 ఏప్రిల్‌లో శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుందన్న కోపంతో నెల నుంచి రెక్కి నిర్వహించి బుధవారం పథకం ప్రకారం చంపేశాడని సీఐ తెలిపారు.