News December 30, 2025

అనకాపల్లి జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.. పెరిగిన సైబర్ క్రైమ్!

image

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 23% నేరాలు తగ్గాయని ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో 2025కి సంబంధించి క్రైమ్ రిపోర్ట్‌ను వివరించారు. మహిళలపై నేరాలు 387 నుండి 291కి, పొక్సో 44 నుండి 43, తీవ్రమైన నేరాలు 591 నుంచి 417కి తగ్గాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 54% తగ్గాయన్నారు. సైబర్ క్రైమ్ 25% పెరిగిందన్నారు. 1,880సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు.

Similar News

News January 2, 2026

నెల్లూరు కలెక్టర్ సరికొత్త ఐడియా..!

image

<<18602332>>ఛాంపియన్ ఫార్మర్స్<<>> పేరిట నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా <<18725510>>మాట్లాడే <<>>వీలు కల్పించారు. చేపలు, రొయ్యలు, ఆక్వా సాగు సందేహాలపై మత్స్యశాఖ శాస్త్రవేత్త N.తీరజ(9866210891)కు ఉద్యాన పంటలు, విత్తనాల ఎంపికపై ఉద్యానవన శాఖ అధికారిణి లక్ష్మికి(7995088181) కాల్ చేయవచ్చు.

News January 2, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,140 పెరిగి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 ఎగబాకి రూ.1,24,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 2, 2026

కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

image

TG: కృష్ణా జలాల వ్యవహారంలో కాంగ్రెస్, BRS తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద జల్లుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కృష్ణా జలాల్లో 299 TMCలు చాలని KCR సంతకం చేసింది నిజమే. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం అడిగిన నీటి వివరాలివ్వకుండా రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అందుకే DPRను కేంద్రం వెనక్కు పంపింది. చేసిన అన్యాయంపై కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు.