News April 24, 2024

అనకాపల్లి జిల్లాలో పది పరీక్షలో 89.04 శాతం మంది ఉత్తీర్ణత

image

అనకాపల్లి జిల్లాలో 10 పరీక్షల్లో 89.04 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 21,169 మంది పరీక్షకు హాజరు కాగా 18,848 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 14,725 ప్రథమ శ్రేణిలో, 2,867 మంది ద్వితీయ శ్రేణిలో, 1256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు. పాయకరావుపేట జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన కె. సత్య ధనస్వాతి 592 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.

Similar News

News April 22, 2025

K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు 

image

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు.‌ 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.

News April 21, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 113 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 113 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు. ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.

News April 21, 2025

V.M.R.D.Aకు ఇన్‌ఛార్జ్ కమిషనర్ 

image

V.M.R.D.A. మెట్రోపాలిటన్ కమిషనర్ K.S. విశ్వనాథన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (M.M.R.D.A.) కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సోమవారం ముంబై వెళ్లారు. 22వ తేదీన కూడా ఆయన అధ్యయనం ముంబైలో ఉంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ని ఇన్ ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

error: Content is protected !!