News March 16, 2025

అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News March 10, 2026

తమిళనాడులో NDAకు ఎంట్రీ లేదు: స్టాలిన్

image

బీజేపీ ఆధ్వర్యంలోని NDAకు తమిళనాడులో ఎంట్రీ లేదని సీఎం స్టాలిన్ అన్నారు. ‘TNకు ఏమీ ఇవ్వకూడదనుకునే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? అయినా ఓట్లు అడిగేందుకు వాళ్లెలా వస్తారు? ఈ ఎన్నికలు తమిళనాడు-NDA మధ్య, DMK టీమ్‌కు-ఢిల్లీ టీమ్‌కు మధ్యే జరుగుతున్నాయి. AIADMKను మింగేయాలని బీజేపీ చూస్తోంది. ఆ పార్టీని చూస్తే జాలి కలుగుతోంది. బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు’ అని విమర్శించారు.

News March 10, 2026

నిర్వాసితులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వారికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. క్రషర్ వివాదంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అసత్య ప్రచారాలు చేసే వారికి అసెంబ్లీ సాక్షిగా గట్టి సమాధానం చెబుతానని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News March 10, 2026

HYD: అర్ధరాత్రి సందడే.. సందడి!

image

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.