News December 15, 2025
‘అనకాపల్లి జిల్లాలో రబీ సీజన్లో 15,630 హెక్టార్లలో పంటల సాగు’

అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది రబీలో 15,630 హెక్టార్లలో పంటల సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా 14,559 టన్నుల ఎరువులు అవసరమని గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి తెలిపారు. ఇప్పటికే 7,120 టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు. ఈ నెలాఖరులో మరో 1,704 టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని వెల్లడించారు. నానో ఎరువులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
Similar News
News December 16, 2025
‘జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికలు లేవు’

చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క జూలూరుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టు కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఆ గ్రామానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొత్తం స్థానాల్లో 10 ఏకగ్రీవంగా ఖరారయ్యాయని, మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు.
News December 16, 2025
ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News December 16, 2025
AP-RCET ఫలితాలు విడుదల

పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <


