News March 22, 2025
అనకాపల్లి జిల్లాలో వడగాల్పులు

జిల్లాలో పలు చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని APSDMA తెలిపింది. జిల్లాలో శుక్రవారం నాతవరంలో 40.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దెబ్బకు వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని తెలిపింది. అటు వైద్య శాఖ సైతం పలు సూచనలు చేసింది.
Similar News
News March 22, 2025
మదనపల్లెలో మైనర్ బాలికకు పెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు

మదనపల్లె మండలంలో మైనర్ బాలికకు పెళ్లి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికకు వారం క్రితం తండ్రికి తెలియకుండా తల్లి పెళ్లి చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు బాలిక తల్లికి ఫోన్ చేసి స్టేషక్కు రావాలన్నారు.
News March 22, 2025
HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

హయత్నగర్లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ శాఖ తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్పేటలో నివాసం ఉండే బాబ్జీకి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.
News March 22, 2025
బీఆర్ఎస్ పార్టీని వీడను: మల్లారెడ్డి

TG: తాను కాంగ్రెస్లో చేరుతానని జరుగుతున్న ప్రచారంపై BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీని వీడట్లేదని తెలిపారు. అభివృద్ధి, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్లో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి తమ కుటుంబం నుంచి నలుగురు సిద్ధమన్నారు. జమిలి ఎన్నికలు వస్తే ఎంపీగా పోటీ చేస్తానన్నారు.