News February 6, 2026

అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఒకే రోజు ముగ్గురి మృతి

image

అనకాపల్లి జిల్లాలో గురువారం విషాదం నెలకొంది. ఒక్క రోజే జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మునగపాకకు చెందిన TDP నేత బి.లక్ష్మణరావు (52)ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చనిపోయారు. అదేవిధంగా రాంబిల్లి మండలం దిమిలికి చెందిన అన్నదమ్ములు జనపరెడ్డి తాతాజీ, వెంకటేశ్వరరావు కశింకోట మండలంలో లారీ ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 7, 2026

KMR: మద్యం, మాంసం, మనీ ఎంత ప్రభావం చూపేనో?

image

ఎన్నికలంటే గుర్తొచ్చేది మద్యం, మాంసం, మనీయే. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల్లో సైతం కామారెడ్డి జిల్లాలో ఇదే తీరు కనిపొస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పొద్దున టిఫిన్లు అందిస్తే, సాయంత్రానికి స్వీట్లు పంచారు. ఎలక్షన్ ప్రచారం ముగింపు దశకు చేరడంతో వచ్చే ఆదివారం మద్యం, మాంసంతో అభ్యర్థులు వార్డు ప్రజలకు దగ్గర కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావాలు ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

News February 7, 2026

క్రేజీ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ

image

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్‌ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.

News February 7, 2026

బిచ్కుంద: పూరి గుడిసె వాసికి అధికార పార్టీ టికెట్

image

బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పూరి గుడిసెలో నివసించే దళిత మహిళ హన్మవ్వకు కాంగ్రెస్ బీఫాం దక్కంది. హన్మవ్వ భర్త గంగారం 40 ఏళ్ల పాటు పార్టీలో కార్యకర్తగా సేవలందించారు. ఆయన ఇటీవల మృతి చెందారు. అతని సేవలను గుర్తించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గంగారం భార్యకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.