News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 71.20 శాతం పోలింగ్ నమోదు

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 12.00 గంటల వరకు 71.20 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. దేవరాపల్లిలో 63.49 శాతం, చీడికాడలో 71.74 శాతం, మాడుగులలో60 శాతం, గొలుగొండలో 62.20, రోలుగుంటలో 64.58, రావికమతంలో 57.69, బుచ్చయ్యపేటలో 73.53 శాతం నమోదయింది. అలాగే చోడవరంలో 66.67, కె.కోటపాడులో 75.70, నర్సీపట్నంలో 75.98, నాతవరంలో 80.28, కోటవురట్లలో72.84, మాకవరపాలెంలో 71.70 శాతం నమోదయింది.
Similar News
News March 1, 2026
నిఘా నీడలో నెల్లూరు: ఎస్పీ

జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త సాంకేతికతతో డ్రోన్ నిఘాను ముమ్మరం చేశారు. పట్టణ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, తోటలపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. గంజాయి విక్రయాలు, బహిరంగంగా మద్యం తాగడం, పేకాట, ఈవ్ టీజింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News March 1, 2026
రెబ్బెన: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య (UPDATE)

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కిరణ్- సరిత దంపతులకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా కిరణ్ తాగి వచ్చి భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కిరణ్.. శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN

AP: అమరావతిలో నేషనల్ జుడీషియల్ అకాడమీని నెలకొల్పాలని CM చంద్రబాబు CJIని కోరారు. ’మధ్యవర్తిత్వం‘పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఇక్కడ నిర్మించే జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్గా తీర్చిదిద్దుతాం. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే ₹10,000 ఇస్తాం. కేసులు పరిష్కారం కాకున్నా ₹3000 ఇస్తాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్జీల బంగ్లాలను CJI ప్రారంభించారు. AP జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.


