News December 26, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ నర్సీపట్నంలో గంజాయి లేడీ డాన్‌తో సహా ఎనిమిది మంది అరెస్ట్
➤ జిల్లాలో పలుచోట్ల వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు
➤ పాయకరావుపేటలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
➤ షిప్ బోటును ఢీకొన్న ఘటనలో మత్స్యకారుడు గల్లంతు
➤ స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు
➤ మాడుగుల నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు
➤ మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు.

Similar News

News December 29, 2025

మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

image

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.

News December 29, 2025

విశాఖ పోర్ట్‌ తొలి మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరాంజి

image

మహిళా IAS అధికారి రోష్ని అపరాంజి కోరాటిమ పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం–మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆమె విశాఖ వాసి కావడం విశేషం. ఆమె AU నుంచి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. అస్సాంలో కలెక్టర్‌గా, కేంద్ర డిప్యూటేషన్‌లో VSEZలో సేవలందించిన ఆమెకు 2018లో PM అవార్డు లభించింది.

News December 29, 2025

యాదాద్రిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ పండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.