News December 15, 2025
అనకాపల్లి: జిల్లా పోలీస్ కార్యాలయానికి 50 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కారి వేదిక కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ తగాదాలు-34, కుటుంబ కలహాలు-2, మోసపూరిత వ్యవహారాలు-3, ఇతర విభాగాలకు చెందినవి-11 ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీటిపై విచారణ నిర్వహించి వారం రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
కేంద్ర సాయుధ బలగాల్లో 438 ఆత్మహత్యలు

కేంద్ర సాయుధ బలగాలు (CAPFs), అస్సాం రైఫిల్స్, NSGలో 2023-25 మధ్య 438మంది సైనికులు సూసైడ్ చేసుకున్నారని కేంద్రం లోక్సభలో తెలిపింది. అత్యధికంగా CRPFలో 159ఆత్మహత్యలు నమోదైనట్లు చెప్పింది. అటు 2014-2025 మధ్య CAPF, అస్సాం రైఫిల్స్లో 23,360మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇందులో BSFలో ఎక్కువ మంది 7,493మంది ఉన్నారంది. ఈ ఏడాది 3,077మంది రిజైన్ చేయగా వారిలో 1,157మంది BSF సైనికులున్నట్లు చెప్పింది.
News December 17, 2025
SRH ఫుల్ టీమ్ ఇదే!

IPL మినీ వేలంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత SRH ఫుల్ టీమ్ చూసేయండి. అభిషేక్, అనికేత్ వర్మ, కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, క్లాసెన్, ఇషాన్ కిషన్, ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్, కమిన్స్, స్మరణ్, హెడ్, జీషన్ అన్సారి, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రైన్స్ ఫులేట్రా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.
News December 17, 2025
ఆదిలాబాద్: సమస్యలు సృష్టించే 756 మంది బైండోవర్

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గొడవలు సృష్టించే అవకాశం ఉన్న 756 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను కూడా సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడు విడతల బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


