News February 10, 2026
అనకాపల్లి టీడీపీలో ముదురుతున్న పెట్రోల్ బంక్ రాజకీయం

అనకాపల్లిలో డీసీఎంఎస్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ టీడీపీలో రాజకీయ దుమారం రేపుతోంది. డీసీఎంఎస్ ఛైర్మన్గా టీడీపీకి చెందిన కోట్ని బాలాజీ బాధ్యతలు తీసుకున్న తరువాత పెట్రోల్ బంక్ పనులు జరుగుతున్న సమయంలో గత శనివారం మాజీ మంత్రి డీవీఆర్ తనయుడు రత్నాకర్ హైరానా చేసినట్లు సమాచారం. దీంతో ఈ సమస్యను పార్టీలోని ఇరువర్గాలు మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లినట్లు పార్టీ పెద్దలు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
పైజామా లాగడమూ అత్యాచారయత్నమే: సుప్రీంకోర్టు

మహిళల పైజామా లాగడం, వక్షోజాలను తాకడం కూడా అత్యాచారయత్నమే అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2025లో ఓ 11ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సెక్షన్ 376, సెక్షన్ 18 కింద అంతకుముందు స్పెషల్ జడ్జి ఇచ్చిన సమన్లను పునరుద్ధరించింది. కాగా స్పెషల్ జడ్జి సమన్లను, అత్యాచారయత్న ఆరోపణలు కొట్టివేసి సెక్షన్లను మార్చి గతఏడాది అలహాబాద్ HC తీర్పునిచ్చింది.
News February 18, 2026
విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, 71 యుద్ధ నౌకల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.
News February 18, 2026
UAEపై సౌతాఫ్రికా ఘన విజయం

T20WC: UAEని సౌతాఫ్రికా మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అరబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బ్రెవిస్ 36 పరుగులతో రాణించారు. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని సౌతాఫ్రికా ఇప్పటికే సూపర్-8కి చేరుకోగా UAE టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.


