News September 14, 2025

అనకాపల్లి: ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్

image

నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15 న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

Similar News

News September 14, 2025

HYD: డ్రగ్స్ పసిగట్టడంలో మన డాగ్ స్క్వాడ్ భేష్

image

డ్రగ్స్ పసిగట్టడంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డాగ్ స్క్వాడ్ మేటిగా నిలిచింది. రైల్వే ప్రొటెక్షన్ టీం డాగ్ కాంపిటీషన్ 2025లో నార్కోటిక్ ట్రేడ్ కేటగిరీలో బ్రాంచ్ మెడల్ కైవసం చేసుకున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం వెల్లడించింది. HYDకు వచ్చిన రైళ్లలో సేవలు అందిస్తున్నీ ఈ బృందం అద్భుతంగా తనిఖీలు చేసి, డ్రెస్‌ను పసిగట్టిందన్నారు.

News September 14, 2025

BELలో ఇంజినీర్ పోస్టులు

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంటెక్/ఎంఈ , ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 14, 2025

కంకిపాడు: మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు నేడే

image

కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా మోడరన్ పెంటాథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.