News September 14, 2025
అనకాపల్లి: ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్

నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15 న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
Similar News
News September 14, 2025
HYD: డ్రగ్స్ పసిగట్టడంలో మన డాగ్ స్క్వాడ్ భేష్

డ్రగ్స్ పసిగట్టడంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డాగ్ స్క్వాడ్ మేటిగా నిలిచింది. రైల్వే ప్రొటెక్షన్ టీం డాగ్ కాంపిటీషన్ 2025లో నార్కోటిక్ ట్రేడ్ కేటగిరీలో బ్రాంచ్ మెడల్ కైవసం చేసుకున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం వెల్లడించింది. HYDకు వచ్చిన రైళ్లలో సేవలు అందిస్తున్నీ ఈ బృందం అద్భుతంగా తనిఖీలు చేసి, డ్రెస్ను పసిగట్టిందన్నారు.
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
కంకిపాడు: మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు నేడే

కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా మోడరన్ పెంటాథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.