News October 8, 2025

‘అనకాపల్లి-తిరుపతి ట్రైన్‌లో జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలి’

image

అనకాపల్లి-తిరుపతి స్పెషల్ ట్రైన్‌లో సామాన్య ప్రయాణికులకు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం అనకాపల్లి నుంచి నడిచే ఈ రైల్లో అన్ని ఏసీ బోగీలో కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు నిరాశ పడుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు.

Similar News

News October 8, 2025

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం.. ఏకశిలా నగరం!

image

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం ఓరుగల్లు. వారు నిర్మించిన చెరువులు, దేవాలయాలు కోకొల్లలు. వాటిలో ఒకటే ఏకశిలా నగరం. రాతి బండతో ఏర్పడిన ఈ ఏకశిలపై కోట నిర్మించడంతో ఈ పేరు వచ్చింది. దీన్ని రాజధాని రక్షణకు వ్యూహాత్మక స్థలంగా కాకతీయులు ఉపయోగించారు. పైనుంచి చుట్టుపక్క ప్రాంతాలన్నీ కనిపించేలా ఉండటంతో నిఘా కేంద్రంగా పనిచేసింది. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో ఈ కొండ రాజభవనంలా విరాజిల్లింది.

News October 8, 2025

APPLY NOW: ఇస్రోలో 20 పోస్టులు

image

ఇస్రో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News October 8, 2025

వరంగల్: భారీగా తగ్గిన పలికాయ ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి చిరుధాన్యాలు నేడు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, సూక పల్లికాయకు కూడా నిన్నటి లాగే రూ.6,610 ధర వచ్చింది. పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,710 ధర పలకగా.. ఈరోజు భారీగా పడిపోయి రూ.4100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.