News March 17, 2025

అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

image

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Similar News

News March 17, 2025

BREAKING: మోదీ పాడ్‌కాస్ట్ షేర్ చేసిన ట్రంప్

image

ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్‌కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్‌కాస్ట్‌లో RSSతో అనుబంధం, భారత్‌కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

News March 17, 2025

భారీగా కార్ల ధరలు పెంచుతున్న మారుతీ సుజుకీ

image

కస్టమర్లకు మారుతీ సుజుకీ షాకిచ్చింది. 2025, APRIL నుంచి కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడి వనరుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మోడల్‌ను బట్టి కస్టమర్లపై తక్కువ భారం వేసేందుకే ప్రయత్నించామని వెల్లడించింది. 2025లో ఈ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి. గత DEC ప్రకటించిన 4% పెంపు JANలో అమల్లోకి వచ్చింది. FEBలో మోడల్‌ను బట్టి రూ.1500-32,500 వరకు పెంచింది.

News March 17, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

image

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.

error: Content is protected !!