News October 18, 2025
అనకాపల్లి: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పోలీసులు శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రమదానంతో కార్యాలయం ఆవరణలో తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీలు దేవ ప్రసాద్, మోహనరావు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.
Similar News
News October 18, 2025
ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా కల్చర్ సాగు చేసేవారు కచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధి చేయుటకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపారు. లైసెన్సుల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 18, 2025
ఊరిస్తున్న రికార్డులు.. కోహ్లీ అందుకుంటాడా?

విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత AUS సిరీస్తో పునరాగమనం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
*మరో 54 runs: ODIల్లో అత్యధిక రన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్.
*68 runs: లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ల (ODI, T20)లో ఫస్ట్ ప్లేస్కు. సచిన్ (18,436) తొలి స్థానంలో ఉన్నారు.
*సెంచరీ: ఓ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు(సచిన్-51), ఆసియా వెలుపల ఎక్కువ సెంచరీలు చేసిన Asian బ్యాటర్గా (సచిన్-29) రికార్డు
News October 18, 2025
‘సూర్యలంక బీచ్లో షూటింగ్లకు వసతులు కల్పించండి’

పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్లో సినిమా షూటింగ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించవలసిందిగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను సినీ దర్శకుడు, మా-ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా కోరారు. శనివారo బాపట్ల కల్టెక్టర్ను కలిసి వినతి అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిలో సూర్యలంక బీచ్ భాగం కాగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినతి ఇచ్చిన వారిలో నటుడు మిలటరీ ప్రసాద్ ఉన్నారు.