News January 5, 2026
అనకాపల్లి: ప్రజా ఫిర్యాదుల వేదికలో 47అర్జీలు

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS)లో మొత్తం 47 అర్జీలు స్వీకరించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలు 22, కుటుంబ కలహాలు 3, మోసపూరిత కేసులు 2, ఇతర విభాగాలవి 20 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా 7 రోజుల్లో పరిష్కరించాలని ఆయన అధికారులు ఆదేశించారు.
Similar News
News February 10, 2026
HYD ఉద్యోగులకు గుడ్న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

కొత్త ఇన్కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
News February 10, 2026
ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎస్పీ పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి 1,097 మంది, 5 ప్లాటున్ల టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించారు.
News February 10, 2026
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సీఎం సమీక్ష

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి ఆయన భక్తుల రద్దీ, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనితలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. శివదీక్ష మాలధారుల పట్ల ఎవరూ అగౌరవంగా వ్యవహరించకూడదని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


