News March 10, 2025

అనకాపల్లి: ప్రజా వేదికలో 440 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. మొత్తం 440 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

Similar News

News March 10, 2025

అబ్బాయిలకూ పీరియడ్స్ వంటి సమస్య!

image

అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో అబ్బాయిలూ ప్రతి నెలా IMS(ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంటుంది. నెలలో IMS సమయంలో వీరు ఎవరితో మాట్లాడరు. చిరాకు పడటం, రీజన్ లేకుండా కోప్పడతారు. దేనిపైనా ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి సమయంలో వారితో ఆర్గ్యుమెంట్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీకు ఇలానే అనిపిస్తుందా? COMMENT

News March 10, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

image

* KMR జిల్లా SPగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్‌చంద్ర 
* మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా అధికారులు
* KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు 
* KMR: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్: కలెక్టర్ 
* జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతరావు చిత్ర పటానికి పాలాభిషేకం
* కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు: MLA
* జిల్లా పంచాయతీ అధికారిగా మురళీ 
* ‘షబ్బీర్ అలీకి MLCగా అవకాశం కల్పించాలి’

News March 10, 2025

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం నామినేషన్ దాఖలు

image

ఎమ్మెల్యే కోటా సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తం, అద్దంకి దయాకర్, సీపీఐ నాయకుల బృందం పాల్గొన్నారు. సీపీఐ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు.

error: Content is protected !!