News February 17, 2025
అనకాపల్లి: ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డ్ జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 2313 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 20, 2025
దైవమే పాటించిన ధర్మం

శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోడానికి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. లోక నాయకుడైనప్పటికీ భూలోక నియమాలు పాటించి, పత్రం రాసిచ్చి, కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని మాటిచ్చారు. నేటికీ భక్తుల కానుకల రూపంలో ఆ రుణాన్ని తీరుస్తున్నారు. మనం ఎంత గొప్పవారమైనా సమాజ నియమాలను గౌరవించాలని, తీసుకున్న అప్పును బాధ్యతగా తిరిగి చెల్లించాలని, కష్టకాలంలో సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలని తెలుపుతుంది.
News December 20, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 142 సొసైటీలు

తెలంగాణ వ్యాప్తంగా కో ఆపరేటివ్ బ్యాంకులు <<18617893>>సొసైటీల పాలకవర్గాలు రద్దు<<>> కావడంతో గ్రామాల్లో నాయకులు, రైతు ప్రతినిధులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. సర్పంచ్గా ఓడిన వారు పోటీ చేయని సీనియర్ నేతలు అప్పుడే రంగంలోకి దిగి లాబీయింగ్ ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ పాలకవర్గం నామినేట్ కానుంది. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 53, మొత్తం 142 సొసైటీలకు కొత్త అధ్యక్షులు రానున్నారు.
News December 20, 2025
నేటి నుంచి రాజధాని యువతకు CRDA-SRM ఉచిత నైపుణ్య శిక్షణ

AP CRDA SRM యూనివర్శిటీతో కలిసి రాజధాని ప్రాంత యువత కోసం ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. డిసెంబర్ 20 నుంచి అమరావతిలోని SRM క్యాంపస్లో ఈ శిక్షణలు నిర్వహించనున్నారు. కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://tinyurl.com/srmapcrda లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని CRDA కమిషనర్ తెలిపారు.


