News October 27, 2025

అనకాపల్లి: మొంథా తుఫానుపై ప్రత్యేక అధికారి ఆరా

image

మొంథా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సైక్లోన్ ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పర్యటించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం కూడా ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. తీర గ్రామాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక కావాలని ఆదేశించారు.

Similar News

News October 27, 2025

HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.

News October 27, 2025

మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

image

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

News October 27, 2025

జూబ్లీ బైపోల్స్: కీలకం కానున్న సినీ కార్మికులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సినీ కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. షేక్‌పేట, బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులున్నారు. దీంతో అభ్యర్థులు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమన్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.