News February 6, 2025
అనకాపల్లి: మొన్న మూడు.. నిన్న నిల్..!
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా నిన్న బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
Similar News
News February 6, 2025
Stock Markets: పెరిగిన డిఫెన్సివ్ స్టాక్స్
స్టాక్మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదు. బంగారం, డాలర్ ఇండెక్స్, US బాండ్ యీల్డులు పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. నిఫ్టీ 23,638 (-58), 78,102 (-163) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు ఎగిశాయి. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
News February 6, 2025
సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారు.. వలసదారుల ఆవేదన
US నుంచి INDకు చేరుకున్న వలసదారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఉన్నంతసేపు చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారని 36 ఏళ్ల జస్పాల్ సింగ్ వాపోయారు. అమృత్సర్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వాటిని తీసేశారని చెప్పారు. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లున్న ఫొటోలు వైరల్ కాగా కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కానీ ఆ ఫొటోలు గ్వాటెమాల వలసదారులవని PIB ఫ్యాక్ట్చెక్ తెలిపింది.
News February 6, 2025
ఘోరం.. విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల లైంగికదాడి
పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల నుంచి స్కూల్కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తల్లి వెల్లడించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.