News March 30, 2025

అనకాపల్లి: రక్షణ కోసం 24 గంటలు నిమగ్నమై ఉంటా- ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో ముస్లింల రక్షణ కోసం 24 గంటలు నిమగ్నమై ఉంటానని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. శనివారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయన్నారు. 

Similar News

News September 17, 2025

జగిత్యాల: జడ్జి, ఎస్పీని కలిసిన అడిషనల్ కలెక్టర్

image

జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతిని, ఎస్పీ అశోక్ కుమార్ ను అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజా గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల నూతనంగా అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

జగిత్యాల: నవంబర్‌లో డీఈఐఈడీ, డీపీఎస్ఈ పరీక్షలు

image

2024-26 బ్యాచ్‌కు చెందిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ లో నిర్వహించబడతాయని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 22లోగా ప్రిన్సిపల్‌కు ఫీజులు చెల్లించవచ్చన్నారు. 50 రూపాయల లేట్ ఫీజ్ తో ఈనెల 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఆన్లైన్ లో అయితే లేట్ ఫీజు లేకుండా 23లోగా లేట్ ఫీజు తో 30లోగా చెల్లించాలన్నారు.

News September 17, 2025

NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.