News January 1, 2026
అనకాపల్లి: రేపటి నుంచి రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ

జిల్లాలో రేపటి నుంచి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రీసర్వే జరిగిన 373 గ్రామాల్లో గతంలో జారీ చేసిన 2,01,841 పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజు ముద్రతో కొత్తవి రైతులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులకు అందజేసి రైతులు కొత్తవి పొందాలని కోరారు.
Similar News
News February 20, 2026
ఎన్టీఆర్ జిల్లాలో TODAY TOP NEWS

* విజయవాడలో దారుణం కూతురిపట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* విస్సన్నపేటలో కారు బీభత్సం.. పట్టుకున్న స్థానికులు
* ఇబ్రహీంపట్నంలో ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు
* వత్సవాయిలో హోలీ పేరుతో మామూలు వసూళ్లు
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్నదానానికి రూ.5 లక్షల విరాళం!
* జగ్గయ్యపేట: జగన్ పర్యటనలో మృతి చెందిన కార్యకర్త ఫ్యామిలీకి సాయం
News February 20, 2026
రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆసుపత్రిలోని నిర్మాణ పనులు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాల పనితీరును ఆయన పరిశీలించారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని, వైద్య సేవల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
News February 20, 2026
HYD: TG EAPCETకి 10,924 దరఖాస్తులు

TG EAPCET ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించి 4,111 మంది విద్యార్థులు నేడు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 6,800 మంది అప్లై చేయగా 2 విభాగాలకు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 10,924 అప్లికేషన్ వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.


