News March 28, 2025

అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

image

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.

Similar News

News November 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 5, 2025

WTM-2025లో పాల్గొన్న మంత్రి దుర్గేశ్

image

లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్(WTM)-2025 సమావేశంలో AP పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన స్టాల్‌, AP పర్యాటక స్టాల్‌ను వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులతో రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల అవకాశాలు, టూరిజం ప్యాకేజీల గురించి వివరించారు. AP పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News November 5, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

నిరుద్యోగ యువతీయువకులకు జిల్లా కేంద్రంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతిరావు తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో 30 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్, ఆపై పాసైనవారు, 20- 30ఏళ్ల వయసు గలవారు అర్హులు. ఆసక్తిగలవారు వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు. కశ్మీర్ గడ్డ, ఈసేవ కేంద్రం పైఅంతస్తులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని అధికారి సూచించారు.